News
ఎమ్మెల్యే రోజాకు మరో షాక్
ఎమ్మెల్యే రోజాకు మరోసారి ప్రివిలేజ్ నోటీసులు అందనున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తాజాగా స్పీకర్పై రోజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇవాళ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వచ్చి మాక్ ఓటింగ్కు పాల్పడడం సరికాదని, స్పీకర్ కూడా అందుకు సహకరించారని, పదవికి గౌరవం కల్పించే విధంగా స్పీకర్ ప్రవర్తిస్తే బాగుంటుందని, దిగజారి స్పీకర్ పదవికి గౌరవం లేకుండా చేయడం అనేది ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని రోజా అన్నారు. ఈ వ్యాఖ్యలపై రోజాకు నోటీసులు ఇవ్వాలని కోడెల అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. స్పీకర్ను కించపరిచే విధంగా అసత్యాలు మాట్లాడిన రోజాకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు అందాయి. దీంతో వైసీపీలో మరోసారి టెన్షన్ మొదలైంది. ఈ నోటీసులు అందితే రోజా మరోసారి సంజాయిషీ ఇచ్చుకోక తప్పదు. గతంలో అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రోజాకు ప్రివిలేజ్ నోటీసులు అందిన విషయం తెలిసిందే.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








